14 ఏళ్లకే విధ్వంసం! 32 బంతుల్లోనే సెంచరీ.. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో వైభవ్ సూర్యవంశీ పెను తుఫాన్!

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో ఇండియా-ఎ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో 14 ఏళ్ల భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సృష్టించిన విధ్వంసం హైలైట్గా నిలిచింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా-ఎ, వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్తో నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోరు చేసింది. వైభవ్ కేవలం 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్ల సహాయంతో 144 పరుగులు సాధించాడు. కేవలం 17 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న వైభవ్, ఆ తర్వాతి 15 బంతుల్లోనే (మొత్తం 32 బంతుల్లో) సెంచరీ మార్కును అందుకోవడం విశేషం.
అనంతరం 298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు, భారత బౌలర్ల ధాటికి ఏడు వికెట్లు కోల్పోయి 149 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇండియా-ఎ ఘన విజయం సాధించింది.
Tags
Related Articles
- బరువు తక్కువగా ఉన్నా.. పొట్ట మాత్రం ఎందుకు వస్తుంది? భారతీయుల ఆహారమే కారణమా? డాక్టర్ ఎరిక్ బెర్గ్ సంచలన విశ్లేషణ!
- "భారతీయులకు ఆ 'బొజ్జ' ఎందుకు వస్తుంది?".. డాక్టర్ ఎరిక్ బెర్గ్ ట్వీట్ వైరల్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
- ట్రూకాలర్కు ఇక చెక్? వచ్చేసింది ప్రభుత్వ 'కాలర్ ఐడీ'.. ఫోన్ మోగితే చాలు ఆధార్ పేరే కనిపిస్తుంది!
- AI మీ ఉద్యోగాన్ని లాక్కోదు.. కానీ ఏఐ వాడకం తెలిసిన మనిషి మీ పనిని లాగేసుకుంటాడు: నితిన్ మిట్టల్
- ఉచితం పేరుతో మీ డేటా చోరీ? ఎయిర్టెల్, జియో ఏఐ ఆఫర్లపై 'బిగ్' అలర్ట్!
- "అవును.. నేను ఫాసిస్ట్నే అని చెప్పేయ్!".. రిపోర్టర్ ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన ఆన్సర్ మామూలుగా లేదుగా!